ఆన్లైన్ గేమింగ్ చట్టంలో సవరణలు.. ఆర్డినెన్స్ జారీ
ఆన్లైన్ గేమింగ్ చట్టంలో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఆన్లైన్ రమ్మీ లాంటి జూద క్రీడలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. వాటిని ఎవరైనా ప్రోత్సహించినా, ఎక్కడైనా నిర్వహించినా, లేదా ఆడినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు చట్ట సవరణ చేసింది. (Online Gaming Law) కాగా చిన్న పిల్లలు, యువత ఆన్లైన్లో రమ్మీకి ఎక్కువగా బానిస అవుతున్నారు. అంతేకాదు అందుకోసం భారీగా డబ్బులను […]
ఆన్లైన్ గేమింగ్ చట్టంలో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఆన్లైన్ రమ్మీ లాంటి జూద క్రీడలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. వాటిని ఎవరైనా ప్రోత్సహించినా, ఎక్కడైనా నిర్వహించినా, లేదా ఆడినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు చట్ట సవరణ చేసింది. (Online Gaming Law)
కాగా చిన్న పిల్లలు, యువత ఆన్లైన్లో రమ్మీకి ఎక్కువగా బానిస అవుతున్నారు. అంతేకాదు అందుకోసం భారీగా డబ్బులను వెచ్చిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ ఘటనలు జరుగుతున్నాయి. రమ్మీ పేరిట మోసాలు పెరుగుతున్నాయి. ఎంతోమంది బాధితులు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. దీంతో ఆన్లైన్ రమ్మీని నిషేధించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆలోచించిన ఏపీ ప్రభుత్వం.. వీటిపై నిషేధం విధించింది.
Also Read:
రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..