రంగులపై సుప్రీం తీర్పు..4 వారాల్లోగా..
ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారంపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వానికి..దేశ అత్యున్నత న్యాయస్థానంలో..
రంగులపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారంపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు..ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు రంగులు తొలగించాలని సర్కార్ను ఆదేశించింది. 4 వారాల్లోగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.