డ్వాక్రా మహిళలకు జగన్ న్యూ ఇయర్ గిప్ట్…
డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలు తీసుకున్న లోన్స్కు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ చెల్లించేందుకు సిద్దమైంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 4 విడతల్లో ఈ చెల్లింపులు జరుపనున్నారు. మొదట మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక రూపాయి జమ చేసి.. తర్వాత వడ్డీ వేయడం ప్రారంభిస్తారు. లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ చెల్లింపులు జరగనున్నాయి. తీసుకున్న రుణం సొమ్ము కట్టేలోపు […]
డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలు తీసుకున్న లోన్స్కు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ చెల్లించేందుకు సిద్దమైంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 4 విడతల్లో ఈ చెల్లింపులు జరుపనున్నారు. మొదట మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక రూపాయి జమ చేసి.. తర్వాత వడ్డీ వేయడం ప్రారంభిస్తారు. లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ చెల్లింపులు జరగనున్నాయి. తీసుకున్న రుణం సొమ్ము కట్టేలోపు 6 నెలలకోసారి ప్రభుత్వం వడ్డీ జమ చేయనుంది.
ఇక జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిలో భాగంగా.. ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకం ద్వాకా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలను మొత్తం నాలుగు విడుతల్లో మాఫీ చేయనున్నారు. కాకపోతే లోన్ తీసుకున్న డ్వాక్రా సంఘాలు బకాయిలు కడుతూనే ఉండాలి. తర్వాత ఆ డబ్బులను వారి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తోంది.