గుడ్ న్యూస్: అర్చకులు, ఇమామ్, మౌజమ్, పాస్టర్ లకు రూ.5 వేల ఆర్థిక సాయం..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సామాన్యులకు జీవనభృతి కరువయింది. లాక్డౌన్ కారణంగా
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సామాన్యులకు జీవనభృతి కరువయింది. లాక్డౌన్ కారణంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా వీరంతా కలిపి దాదాపు 77 వేల మందికి పైగా ఉంటారని ఒక అంచనా.. వీరందరికీ వన్టైం సహాయం కింద రూ. 5 వేల నగదును నేరుగా వారి అకౌంట్లలో సర్కార్ జమ చేయనుంది. దాదాపు 34 వేల మంది అర్చకులు, 30 వేల మంది పాస్టర్లు, 14 వేల మంది ఇమామ్, మౌజమ్లకు సహాయం చేకూరనుంది. ప్రభుత్వం దాదాపు రూ. 38 కోట్ల నగదు సాయం అందించనుంది.
రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు.