ఏపీ : ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నుంచి మినహాయింపు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రాజెక్టు అమలుకు 2019లో ఏఐఐ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరిగింది. కొత్త విధానం ప్రకారం ప్రాజెక్టు అమలు చేయడానికి ఏఐఐ బ్యాంకు నిరాకరించింది. పాత నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని సూచించింది.ఈ క్రమంలో ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ పురపాలకశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏఐఐ బ్యాంకు నిధులు 5,350 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు పాలనా అనుమతులు ఇచ్చింది.
Also Read :
సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్గా 200 కి.మీ…
ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు