పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్
2020-21 ఏడాదికి ఏపీ సర్కార్ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
2020-21 ఏడాదికి ఏపీ సర్కార్ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించింది. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కర్షక్లో పంట వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకుల పంటలు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కనీస గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే వారు కొనుగోలు చేస్తారు. కాగా మద్దతు ధరల్ని జగన్ సర్కార్ పత్రికల ద్వారా ప్రకటించింది. మిర్చి పంట క్వింటాల్కు రూ.7,000 మద్దతు ధర నిర్ణయించింది. ధాన్యం (ఏ-గ్రేడ్ ) 1,888గా నిర్ణయించింది.
ప్రభుత్వం ప్రకటించిన మరికొన్ని పంటల మద్దతు ధరల వివరాలు చూద్దాం….
పంట క్వింటాల్ కు మద్దతు ధర
పసుపు 6,850
కంది 6,000
పెసర 7,196
ఉల్లి 770
మొక్కజొన్న 1,850
సజ్జలు 2,150
జొన్నలు 2,640
కొబ్బరిబాల్ 10,300
కొబ్బరి మర 9,960
బత్తాయి 1,400
శనగలు 5,1,00
అరటి 800
సోయాబీన్ 3,880
మినుములు 6,000
వేరుశనగ 5,275
పొద్దుతిరుగుడు 5,885
Also Read :