AP Eamcet 2020: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!
ఏపీ ఎంసెట్ ఫలితాలను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎంసెట్...
AP Eamcet 2020: ఏపీ ఎంసెట్ ఫలితాలను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలను గత నెల సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ 2020 ఇంజనీరింగ్కు సుమారు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 84. 38 శాతం(సుమారు 1,56,899) మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్) డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి తెలిపారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీకు 87,652 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,834 మంది పరీక్షలు రాశారు.
Also Read:
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!
అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!