ఏపీ డీజీపీ సంచలనంః వారికి లాక్డౌన్ నుంచి ఊరట
కరోనా టెన్షన్, లాక్డౌన్తో పోలీసులంతా బిజీ అయ్యారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. సమయా పాలనలేని విధులు, పై అధికారులతో తిట్లు, జనంతో ఛీత్కారాలు.. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. సెలవులు కూడా లేకుండా రోడ్డేక్కి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న పోలీస్ సిబ్బందికి […]
కరోనా టెన్షన్, లాక్డౌన్తో పోలీసులంతా బిజీ అయ్యారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. సమయా పాలనలేని విధులు, పై అధికారులతో తిట్లు, జనంతో ఛీత్కారాలు.. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. సెలవులు కూడా లేకుండా రోడ్డేక్కి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న పోలీస్ సిబ్బందికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఊరట నిచ్చారు. ఆరోగ్య సమస్యలు ఉన్నపోలీసు ఉద్యోగులకు లాక్డౌన్ విధులు అప్పగించొద్దని అధికారులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్ సిబ్బందికి లాక్ డౌన్ డ్యూటీ వేయొద్దన్నారు. ప్రధానంగా పోలీస్ సిబ్బందిలో హార్ట్ పెషేంట్లు, శ్వాస, బీపీ, షుగర్ వంటి సమస్యలతో ఉన్నవారిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. అటువంటి వారికి పోలీస్ స్టేషన్, ఆఫీస్, కంట్రోల్ రూంలలో మాత్రమే విధులు కేటాయించాలని చెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం విధి నిర్వహణలోనే కాదు..లాక్డౌన్ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్కు కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. రాష్ట్రం కోసం 3 రోజుల వేతనం ఇస్తున్నట్లు ఐఏఎస్ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్ తెలిపారు.