Be Careful: కరోనాపై పుకార్లు సృష్టించారో అంతే సంగతులు..! డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్
కరోనా వైరస్.. ఇప్పుడు దీని పేరు చెబితే చాలు అగ్రరాజ్యాలు సైతం గజగజవణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 70కి పైగా దేశాలను తాకింది. ఇప్పటికే దాదాపు మూడు వేల మందికి పైగా మృతిచెందగా.. లక్షల మంది వైరస్ బారిన పడి.. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గత వారంలో ఇది మన భారతదేశానికి కూడా తాకింది. ఇప్పటికే 30 పాజిటివ్ కేసులు తేలడంతో.. వారికి ప్రభుత్వం ప్రత్యేంకంగా చికిత్సఅందిస్తుంది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ […]
కరోనా వైరస్.. ఇప్పుడు దీని పేరు చెబితే చాలు అగ్రరాజ్యాలు సైతం గజగజవణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 70కి పైగా దేశాలను తాకింది. ఇప్పటికే దాదాపు మూడు వేల మందికి పైగా మృతిచెందగా.. లక్షల మంది వైరస్ బారిన పడి.. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గత వారంలో ఇది మన భారతదేశానికి కూడా తాకింది. ఇప్పటికే 30 పాజిటివ్ కేసులు తేలడంతో.. వారికి ప్రభుత్వం ప్రత్యేంకంగా చికిత్సఅందిస్తుంది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ మన ప్రాంతంలో వచ్చిందంటూ.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఈ వదందులపై ఏపీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్పై లేనిపోని అపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వదంతులు సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని.. వారిపై కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులను పెడుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలిచ్చారు.
కాగా.. ఇప్పటికే వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని డీజీపీ తెలిపారు. ప్రతి రోజూ రాష్ట్ర వైద్యాధికారులతో పాటు.. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తున్నారని గుర్తుచేశారు.