ఏపీలో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
ఏపీ వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ...
ఏపీ వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ… సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలతో పాటు వెయిటింగ్లో ఉన్నవారికి కూడా పోస్టింగ్లు ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
సచివాలయంలో ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న వి.సరళను పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్గా బదిలీ చేశారు. సీసీఎల్ఏలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న జె. శివశ్రీనివాసును నెల్లూరు జిల్లా ఆసరా, సంక్షేమ శాఖల జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న కిరణ్ కుమార్కు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఈవోగా నియమించారు. రైతు బజార్ల సీఈవోగా బి. శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. డి.పెద్దిరాజును శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఈవోగా నియమించారు. డి.వెంకటేశ్వరరావును మాన్సాస్ ట్రస్టు ఈవోగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.