ఏపీ కరోనా రౌండప్ : 9 లక్షలు దాటిన టెస్టులు..రాప్తాడు ఎమ్మెల్యేకు పాజిటివ్
ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు విస్తృతంగా చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే టెస్టులు తొమ్మిది లక్షల మార్కును దాటాయి. మంగళవారం మార్నింగ్ 9 గంటల నుంచి బుధవారం మార్నింగ్ 9 వరకు 28,239 టెస్టులు చేయడం ద్వారా.. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి.
ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు విస్తృతంగా చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే టెస్టులు తొమ్మిది లక్షల మార్కును దాటాయి. మంగళవారం మార్నింగ్ 9 గంటల నుంచి బుధవారం మార్నింగ్ 9 వరకు 28,239 టెస్టులు చేయడం ద్వారా.. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లో వ్యాధి బారి నుంచి కోలుకుని 477 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,988కు చేరింది. కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు సంఖ్య 15,252కి చేరింది. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 2,036 ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించినవి 736. కొత్తగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 193కి చేరింది. కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,071 ఉన్నాయి.
ఇక రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయనతో పాటు గన్మన్, ఇద్దరు కుటుంబ సభ్యులకూ వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన మరో 16 మందికి బుధవారం టెస్టులు నిర్వహించారు.