రాష్ట్రంలో 111కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..ఇవాళ ఒక్కరోజే..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ 10ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 111కు చేరుకుంది. సీఎం జగన్ ఈ రోజు (బుధవారం) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టే సమయానికి మొత్తం 87 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. అందులో 70 మందిలో ఢిల్లీ వెళ్లివచ్చిన వారివి లేదా వారితో లింకులు ఉన్నవాళ్లవని సీఎం వివరించారు. అయితే […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ 10ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 111కు చేరుకుంది. సీఎం జగన్ ఈ రోజు (బుధవారం) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టే సమయానికి మొత్తం 87 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. అందులో 70 మందిలో ఢిల్లీ వెళ్లివచ్చిన వారివి లేదా వారితో లింకులు ఉన్నవాళ్లవని సీఎం వివరించారు. అయితే 7 గంటల వచ్చిన ల్యాబ్ టెస్టులు ఫలితాల ప్రకారం మరో 24 మందికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులెటెన్ లో పేర్కొంది. మొత్తం కలుపుకుంటే ఇవాళ (బుధవారం)ఒక్కరోజే 67 కొత్త పాజిటివ్ కేసులు నమోదయినట్టు తేలుతుంది.