AP Corona Cases: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 139 కొవిడ్ కేసులు.. బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ..
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 49,483 కరోనా పరీక్షలను
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 49,483 కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,86,557 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,142 మంది కరోనాతో మృతిచెందారు. ఇక నిన్న ఒక్కరోజు రాష్ట్రవ్యాప్తంగా 254 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,77,893కి చేరింది. గత రెండు రోజుల నుంచి ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,552గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,27,39,648 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు జరిపినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: