జగన్ సెక్రటేరియట్ ఎంట్రీ ఫిక్స్..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో అడుగుపెట్టే ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. అనంతరం 8.42 నిమిషాలకు సీఎం చాంబర్లో పూజ చేయనున్నారు. 8.50 నిమిషాలకు ముఖ్యమైన ఫైల్స్పై సంతకాలు పెట్టనున్నారు. ఆయనను సచివాలయ సిబ్బంది సన్మానించనున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులు 11.49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో అడుగుపెట్టే ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. అనంతరం 8.42 నిమిషాలకు సీఎం చాంబర్లో పూజ చేయనున్నారు. 8.50 నిమిషాలకు ముఖ్యమైన ఫైల్స్పై సంతకాలు పెట్టనున్నారు. ఆయనను సచివాలయ సిబ్బంది సన్మానించనున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులు 11.49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.