తాడేపల్లిలో చండీయాగం: హాజరైన జగన్

వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణమండపంలో సహస్ర చండీయాగం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని జరిపించారు. సీఎం జగన్‌తో పాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా ఇతర మంత్రులు, వైసీపీ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని.. సకాలంలో వర్షాలు కురవాలని.. వైసీపీ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాలని కోరుతూ ఈ చండీయాగాన్ని నిర్వహించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ ఏడాది క్రితం వైసీపీ […]

తాడేపల్లిలో చండీయాగం: హాజరైన జగన్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 8:00 PM

వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణమండపంలో సహస్ర చండీయాగం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని జరిపించారు. సీఎం జగన్‌తో పాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా ఇతర మంత్రులు, వైసీపీ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని.. సకాలంలో వర్షాలు కురవాలని.. వైసీపీ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాలని కోరుతూ ఈ చండీయాగాన్ని నిర్వహించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ ఏడాది క్రితం వైసీపీ నేతలు ఓ యాగాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి సహకారంతో సాగిన ఈ యాగంలో పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొంటూ వచ్చారు.