నాకు నచ్చిన కార్యక్రమం ఇది : ఏపీ సీఎం

గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ పాఠశాలలో సీఎం జగన్ ప్రారంభించిన ‘రాజన్న బడిబాట’ కార్యక్రమానికి పలువురు మంత్రులు ఆదిమూలపు సురేష్, సుచరిత, తదితరులు హాజరయ్యారు. అలాగే.. భారీగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ చిన్నారులతో దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించి, ‘రాజన్న బడిబాట’ లోగోను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నాకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నా సుదీర్ఘమైన పాదయాత్రలో విద్యార్థుల […]

నాకు నచ్చిన కార్యక్రమం ఇది : ఏపీ సీఎం
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 2:06 PM

గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ పాఠశాలలో సీఎం జగన్ ప్రారంభించిన ‘రాజన్న బడిబాట’ కార్యక్రమానికి పలువురు మంత్రులు ఆదిమూలపు సురేష్, సుచరిత, తదితరులు హాజరయ్యారు. అలాగే.. భారీగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ చిన్నారులతో దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించి, ‘రాజన్న బడిబాట’ లోగోను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నాకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

నా సుదీర్ఘమైన పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు కళ్లారా చూశాను. సరైన సమయానికి పుస్తకాలు, యూనిఫామ్స్ అందేవి కావని, పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని, ఇక అలాంటి సమస్యలు ఉండవన్నారు. పిల్లలందరూ చదువుకోవాలి, పిల్లల చదువే నా ఆశయమన్నారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇక అప్పులపాలు కాకూడదు. చదువుకోవాలన్న కోరిక మీది, చదివించే బాధ్యత నాదన్నారు. తల్లిదండ్రులు కేవలం పిల్లలను బడులకు పంపడమే వారి బాధ్యతన్నారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా పండుగ రోజన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 26వ తేదీన పిల్లల తల్లులకు రూ.15వేలు అందజేస్తామన్నారు.

ఇప్పుడున్న స్కూల్ పరిస్థితులన్నీ మార్చేస్తానని, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కావాలి. అలాగే.. ప్రతి స్కూల్‌లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.