అమిత్ షాతో సీఎం జగన్ భేటీ..వేటిపై చర్చించారంటే?
ఢిల్లీ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై కేంద్ర హోం మంత్రితో చర్చించినట్టు సీఎం జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీని ఒప్పించేందుకు సహరించాలని సీఎం జగన్, అమిత్ షాను కోరారు. లోక్పభ డిప్యూటీ స్పీకర్ పదవిపై వస్తున్న వార్తలన్నీ వదంతులే అన్న ఆయన..ప్రత్యేక హోదా అంశాన్ని నీతి […]
ఢిల్లీ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై కేంద్ర హోం మంత్రితో చర్చించినట్టు సీఎం జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీని ఒప్పించేందుకు సహరించాలని సీఎం జగన్, అమిత్ షాను కోరారు. లోక్పభ డిప్యూటీ స్పీకర్ పదవిపై వస్తున్న వార్తలన్నీ వదంతులే అన్న ఆయన..ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో కూడా చర్చిస్తామని తెలిపారు. జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
ఈ రోజు రాత్రి జన్పథ్ రోడ్డులోని నివాసంలో సీఎం జగన్ బస చేయనున్నారు. శనివారం జరిగే వైసీపీ పార్లమెటరీ పార్టీ భేటీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి,. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొంటారు. నీతిఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై వివరించేందుకు ఇప్పటికే నివేదిక సిద్ధం చేయించిన జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై మాట్లాడనున్నట్టు సమాచారం.