కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీగా మీటింగ్స్‌‌లో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయం అందివ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ.5వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను సీఎం కోరారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు […]

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ
Follow us

|

Updated on: Aug 07, 2019 | 6:37 PM

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీగా మీటింగ్స్‌‌లో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయం అందివ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ.5వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను సీఎం కోరారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న నవరత్నాల పథకాలకు ఆర్థిక సాయం అందించాలని జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం.. బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు.