ముగిసిన ముఖ్యమంత్రుల భేటీ.. అసలేం చర్చించారు?
ప్రగతి భవన్లో ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావుల సమావేశం ముగిసింది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. పోలీసుల ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారుల ఆధ్వర్యంలో చర్చలకు భేటీ అవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయంచారు. ఈ క్రమంలో ఒక్కసారి తెలంగాణా సీఎస్ సహా ఆ […]
ప్రగతి భవన్లో ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావుల సమావేశం ముగిసింది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. పోలీసుల ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారుల ఆధ్వర్యంలో చర్చలకు భేటీ అవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయంచారు.
ఈ క్రమంలో ఒక్కసారి తెలంగాణా సీఎస్ సహా ఆ రాష్ట్ర అధికారుల బృందం ఏపీని సందర్శించనున్నారు. ఆ తరువాత ఏపి సీఎస్ సహా అధికారుల బృందం హైదరాబాద్ రానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం, పరస్పర సహకారం కోసం తరచుగా సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లోని తాగు, సాగునీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లోకి జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం రాకుండా, వారి అవసరాలకు విఘాతం కలగకుండా కృష్ణా–గోదావరి అనుసంధానం సహా చేపట్టాల్సిన పథకాలపై నిర్మాణాత్మక ప్రణాళిక తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశం కావాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు.