ఎస్పీ బాలు కుటుంబసభ్యులకు సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు.
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ట్విటర్ వేదికగా సీఎం జగన్ స్పందిస్తూ.. ‘గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.#RIPSPB
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2020
అనంతరం ఎస్పీ బాలు కుటుంబ సభ్యులను సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ.చరణ్తో సీఎం ఫోన్లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటని కొనియాడారు. ఇటువంటి సమయంలో కుటుంబసభ్యలు ఎవరు కుంగిపోవద్దని ధైర్యంగా ఉండాలన్నారు జగన్. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు.