కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

కరోనా వైరస్‌ మహమ్మారి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి ఉండకపోవచ్చు. కోవిడ్‌పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం..

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 1:40 PM

కరోనా వైరస్‌ మహమ్మారి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి ఉండకపోవచ్చు. కోవిడ్‌పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం ఇంటి దగ్గరే కరోనా నుంచి కోలుకోవచ్చు. పొరుగు రాష్ట్రాలు సరిహద్దులు తెరిచారు. ఎవరి రాకపోకలను మనం కట్టడి చేయలేం. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు ఉంటే ఏం చేయాలన్నదానిపై అవగాహన పెంచుకోవాలి. అలాగే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు సీఎం జగన్.

అలాగే ఆరోగ్య శ్రీ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ప్రస్తుతం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కరోనాను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే. వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదన్నారు. కోటీ 42 లక్షల మందికి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇక నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేకలు మారుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఆరోగ్య శ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు. ఇక డబ్ల్యూహెచ్‌వో సూచించిన మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామని చెప్పారు సీఎం.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అటు పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 452 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 16,621 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, 18,378 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More: 

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..

మరో తెలంగాణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!