నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవన్ష్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా.. రంగనాయకులు మండపంలో నారా వారసుడు దేవాన్ష్కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కరోజు […]
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవన్ష్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా.. రంగనాయకులు మండపంలో నారా వారసుడు దేవాన్ష్కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.30 లక్షలు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళంగా ఇచ్చారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి.