ఏపీ ఎన్నికలకు సర్వం సిద్ధం -గోపాలకృష్ణ ద్వివేది

ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్ క్యాస్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు రావడంతో 7 లక్షల 24వేల 940 ఓట్లను పరిశీలించామన్నారు. ఇందులో 5 లక్షల 25 వేల 957 ఓట్లను తొలగించామన్నారు. ఈ […]

ఏపీ ఎన్నికలకు సర్వం సిద్ధం -గోపాలకృష్ణ ద్వివేది
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 10:31 AM

ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్ క్యాస్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు రావడంతో 7 లక్షల 24వేల 940 ఓట్లను పరిశీలించామన్నారు. ఇందులో 5 లక్షల 25 వేల 957 ఓట్లను తొలగించామన్నారు. ఈ నెల 15 వరకే ఓటరు నమోదు అప్లికేషన్స్ తీసుకుంటామన్నారు.