నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం పిక్సయ్యింది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలపై ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజయ్యింది.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం పిక్సయ్యింది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలపై ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజయ్యింది. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై క్లారిటీ రానుంది.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సచివాలయంలో మొదటి బ్లాకులో 11గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో చర్చించే అంశాలను వివిధ శాఖల నుంచి వచ్చిన అంశాల ఆధారంగా ఖరారు చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, పెండింగ్లో ఉన్న బిల్లులు ఉన్నాయి. వీటి అజెండాను కేబినెట్లో ఖరారు చేసే అవకాశముంది. దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుతో పాటు పలు బిల్లులను అసెంబ్లీ అజెండాలో చేర్చాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు గవర్నమెంట్ రెడీ అవుతుంది.
మరోవైపు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది క్రిస్మిస్ రోజైన డిసెంబర్ 25న పంపిణీ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కేబినెట్లో ఖరారు చేసే ఛాన్స్ ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి. ఆంధ్రాలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది.
Also Read :
స్టార్ హీరోలు కూడా చేయలేని రిస్క్ చేస్తోన్న కియారా, మరి అమ్మడు అదరగొడుతుందా..?