బ్రేకింగ్ః రేపటి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అక్టోబర్ 1న జరగాలని నిర్ణయించారు. కేబినెట్లో పలు అంశాలపై చర్చించాలని భావించారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే, తాజాగా అనివార్య కారణాల వల్ల కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి కేబినెట్ సమావేశం అక్టోబర్ 8న నిర్ణయించనున్నట్లు పేర్కొంది.