బిగ్ బ్రేకింగ్: ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు..
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 22 మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుంది. ఆ రోజు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో..
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 22 మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుంది. ఆ రోజు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా మంత్రి వర్గ సభ్యుల పేర్లను రేపు అధికారికంగా వెల్లడించనుంది ఏపీ ప్రభుత్వం. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ల స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులకు అవకాశం ఉండబోతుంది. మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
Read More:
బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు
షాకింగ్ రిపోర్ట్.. ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడంటే?