టీడీపీ హెలీకాఫ్టర్లో డబ్బులు తరలిస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ
ఏపీలో అధికారమే తమ లక్ష్యమంటున్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. చంద్రబాబు చేసిన తప్పులనే మేము ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఈసీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు కన్నా. ఏపీలో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతోందని.. సీఎం హెలికాఫ్టర్లోనే డబ్బు తరలిస్తున్నారని కన్నా ఆరోపించారు. పోలీసు వాహనాల్లో డబ్బులు సరఫరా చేస్తున్నారని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. పోలీసుల తీరుపై […]
ఏపీలో అధికారమే తమ లక్ష్యమంటున్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. చంద్రబాబు చేసిన తప్పులనే మేము ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఈసీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు కన్నా.
ఏపీలో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతోందని.. సీఎం హెలికాఫ్టర్లోనే డబ్బు తరలిస్తున్నారని కన్నా ఆరోపించారు. పోలీసు వాహనాల్లో డబ్బులు సరఫరా చేస్తున్నారని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. పోలీసుల తీరుపై మేం గతంలోనే సీఈసీకి ఫిర్యాదు చేశాం. డీజీపీని మార్చాలని సీఈసీని కోరామని తెలిపారు. కుటుంబరావు ఏనాడైనా ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడా..? అని ప్రశ్నించారు. అయినా.. కుటుంబరావుకు నన్ను విమర్శించే అర్హత లేదని చెప్పారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ