కొత్త ఇండియా మ్యాప్: అనాధగా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబే కారణమట..
జమ్మూకాశ్మీర్, లఢక్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్లో ఏపీకి రాజధాని లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ.. చంద్రబాబే దానికి కారణమన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులను ఐదు సంవత్సరాలు రాజధాని పేరుతో మోసం చేసి.. చివరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా తీరని ద్రోహం చేశారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. […]
జమ్మూకాశ్మీర్, లఢక్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్లో ఏపీకి రాజధాని లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ.. చంద్రబాబే దానికి కారణమన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులను ఐదు సంవత్సరాలు రాజధాని పేరుతో మోసం చేసి.. చివరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా తీరని ద్రోహం చేశారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.
ఇకపోతే కొత్తగా కేంద్రం రిలీజ్ చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్లో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజధానులను సూచించిన కేంద్రం.. ఏపీకి మాత్రం అమరావతిని చూపించకపోవడంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పొచ్చు. అంతేకాకుండా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
మోసం నీ సహజ గుణమని నిరూపించావ్ చంద్రబాబు..ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశావ్..
5 కోట్ల మంది ఆంధ్రులను 5 సంరాలు రాజధాని పేరుతో మోసం చేసి,కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చుచేసి,ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశావ్. pic.twitter.com/Rr6FMeKThX
— Kanna Lakshmi Narayana (@klnbjp) November 3, 2019