ఆగష్టులో అనుష్క ‘నిశ్శబ్దం’..!
కరోనా నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న చిత్రాలన్నీ ఆన్లైన్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ రెండు, మూడు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యాయి.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న చిత్రాలన్నీ ఆన్లైన్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ రెండు, మూడు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యాయి. మరికొన్ని చిత్రాలు లైన్లో ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు లో బడ్జెట్, యంగ్ హీరోల సినిమాలు మాత్రమే ఓటీటీవైపు చూడగా.. ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్లు కూడా ఆన్లైన్ రిలీజ్ల వైపు చూస్తున్నారట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ జేజమ్మ అనుష్క నటించిన నిశ్శబ్దం కూడా త్వరలో ఆన్లైన్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వగా.. ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న సీజీ వర్క్ ఇటీవల పూర్తి అయ్యిందట. ఈ క్రమంలో నిశ్శబ్దం రిలీజ్కి రెడీగా ఉన్నట్లు సమాచారం.
అయితే ‘నిశ్శబ్దం ఆన్లైన్లో రిలీజ్’ అని ఏప్రిల్ నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని టీమ్ పలుమార్లు ఖండించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరి ముందున్న మార్గం ఓటీటీ ఒక్కటే కాబట్టి.. నిశ్శబ్దంను కూడా అలానే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెలలో నిశ్శబ్దం ఆన్లైన్లో రిలీజ్ అవ్వబోతున్నట్లు సమాచారం. మరి దీనిపై మూవీ యూనిట్ ఎలా స్పందింస్తుందో చూడాలి. కాగా థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన నిశ్శబ్దంలో అనుష్క, మాధవన్ జంటగా నటించగా.. అంజలి, షాలిని, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా పతాకం, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.