మెహుల్ చోక్సీకి భారీ షాక్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. నకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ. 14 వేల కోట్లకు పైగా పీఎన్బీ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ.. అంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అయితే చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని.. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్కు అప్పగించే ప్రక్రియ చేపడుతామని అంటిగ్వా ప్రధాని గాస్టన్ […]
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. నకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ. 14 వేల కోట్లకు పైగా పీఎన్బీ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ.. అంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అయితే చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని.. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్కు అప్పగించే ప్రక్రియ చేపడుతామని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ వెల్లడించారు.
ఆర్థిక నేరాలకు పాల్పడుతూ.. అంటిగ్వాను సేఫ్ జోన్గా భావిస్తున్న వారికి తిప్పలు తప్పవని ఆ దేశ ప్రధాని వెల్లడించారు. ఆర్థిక కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ దేశం విడిచి అంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీ అప్పగింత ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. చోక్సీ తన వాదనను సమర్థించుకోవడంలో విఫలమై.. న్యాయ ప్రక్రియలో చేతులెత్తేసిన తర్వాత.. ఆయన అప్పగిస్తామని హామీ ఇస్తున్నామని ఆ దేశ ప్రధాని స్పష్టం చేశారు.