Pittakathalu: నాలుగు విభిన్న స్టోరీస్తో ‘పిట్ట కథలు’.. మహిళా సమస్యలపై దర్శకులు ఏం చెబుతున్నారంటే..
Pittakathalu: నాలుగు కథల సమాహారంగా రూపొందిన పిట్టకథలు సినిమా విడుదలకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ చిత్రం
Pittakathalu: నాలుగు కథల సమాహారంగా రూపొందిన పిట్టకథలు సినిమా విడుదలకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదలకానుంది. ఆంథాలజీతో ఈ సినిమా టాలీవుడ్లో కొత్త ట్రెండ్ను మొదలుపెడుతుంది. జగపతిబాబు, అమలాపాల్, మంచు లక్ష్మి, శృతిహాసన్, సత్యదేవ్, ఇషారెబ్బా కీలక పాత్రల్ని పోషించారు. ఆర్ఎస్పీవీ, ఫ్లయింగ్ యూనికార్న్ పతాకాలపై రోనీ స్క్రూవాలా, ఆశిదువా ఈ చిత్రాన్ని నిర్మించారు.
భిన్నమైన సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహిళా సాధికారతను, వారు ఎదుర్కొనే సమస్యల్ని చూపించబోతున్నామని దర్శకుడు తరుణ్ భాస్కర్ చెబుతున్నారు. మానవ సంబంధాల్ని సహజంగా కొత్త కోణంలో చూపించే చిత్రమిదని నందినిరెడ్డి అంటోంది. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల వారిని కూడా ఆకట్టుకుంటుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సంకల్ప్రెడ్డి మాట్లాడుతూ నాలుగు కథలు ప్రత్యేకమైన ఇతివృత్తాలతో మానవీయ విలువల ప్రధానంగా సాగుతాయని అన్నారు. నలుగురు దర్శకులు విభిన్న కథాంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 వరల్డ్కప్కు కౌంట్డౌన్ షురూ.. వేదికగా భారత్.. మోతేరా స్టేడియంలో ఫైనల్.!