మరో మోదీ మార్క్ డెసిషన్.. ఆ రెండింటికీ ఒకటే రాజధాని!
Another union territory came into existence on Republic Day: డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని మోదీ సర్కార్ కొద్ది నెలల కిందటే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం […]
Another union territory came into existence on Republic Day: డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని మోదీ సర్కార్ కొద్ది నెలల కిందటే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ కొత్తగా ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతానికి డామన్ను ఉమ్మడి రాజధానిగా చేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసే బిల్లు గతేడాది డిసెంబర్ 3న పార్లమెంట్లో ఆమోదం పొందింది.
ఈ విలీనంతో.. ఇప్పుడు దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండనున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మూడు నెలల అనంతరం డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత రెండు వేర్వేరు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్లు ఏర్పడిన సంగతి విదితమే.