మరో సెన్సేషనల్ డైరెక్టర్ని లాక్ చేసుకున్న మైత్రీ సంస్థ!
ఇండస్ట్రీల్లోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.
Mythri Movie Makers locked another director: ఇండస్ట్రీల్లోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ సంస్థ ఇప్పటికే కొరటాల, సుకుమార్, విక్రమ్ కుమార్ వంటి పలువురు సెన్సేషనల్ డైరెక్టర్లతో పనిచేసింది. అంతేకాదు పవన్ కోసం హరీష్ శంకర్, మహేష్ కోసం పరశురామ్, ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్లను లాక్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సంస్థ మరో సెన్సేషనల్ దర్శకుడిని లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కార్తీ హీరోగా ‘ఖైదీ’ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజుతో మైత్రీ సంస్థ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా ఈ దర్శకుడు మాస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ను జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ తరువాత ఓ తెలుగు-తమిళ్ బైలింగ్వుల్ కోసం లోకేష్ కనగరాజును మైత్రీ సంస్థ లాక్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్. మరి ఇందులో నిజమెంత..? మైత్రీ నిర్మాణంలో లోకేష్ కనగరాజు ఏ హీరోను డైరెక్ట్ చేయబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Read This Story Also: రెండు చైనా యాప్లను బ్లాక్ చేసిన కేంద్రం