టీడీపీకి మరో గట్టి షాక్.. వైసీపీలోకి కీలక నేత
విజయవాడ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో అధికార టీడీపీ పార్టీకి షాక్ల మీద షాక్లు పడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు పేరు మోసిన నేతలు వైసీపీ, జనసేనలోకి వెళ్లగా.. తాజాగా మరో కీలక నేత పార్టీ వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి శనివారం దాసరి, జగన్ను కలవనున్నట్లు కూడా తెలుస్తోంది. వైసీపీ నేత దగ్గుబాటి వేంకటేశ్వరరావుకు […]
విజయవాడ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో అధికార టీడీపీ పార్టీకి షాక్ల మీద షాక్లు పడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు పేరు మోసిన నేతలు వైసీపీ, జనసేనలోకి వెళ్లగా.. తాజాగా మరో కీలక నేత పార్టీ వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి శనివారం దాసరి, జగన్ను కలవనున్నట్లు కూడా తెలుస్తోంది.
వైసీపీ నేత దగ్గుబాటి వేంకటేశ్వరరావుకు దాసరి మంచి స్నేహితుడు. ఈ నేపథ్యంలో దాసరి వైసీపీలో చేరేందుకు దగ్గుబాటి పావులు కదిపినట్లు సమాచారం. అంతేకాదు వైసీపీ నుంచి దాసరికి విజయవాడ ఎంపీ సీటు కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఆ స్థానం నుంచి టీడీపీ తరపున కేశినేని నాని ఎంపీగా పోటీచేయనుండగా.. అతడిపైన పోటీ చేసేందుకు దాసరిని జగన్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.