ఢిల్లీ కేన్సర్ ఆసుపత్రి నర్సులకూ కరోనా..
ఢిల్లీలోని కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సహా 11 మంది నర్సులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇందులోని రోగులతో బాటు మొత్తం 18 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతవారం ఈ డాక్టర్ కి కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిని మూసివేశారు.
ఢిల్లీలోని కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సహా 11 మంది నర్సులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇందులోని రోగులతో బాటు మొత్తం 18 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతవారం ఈ డాక్టర్ కి కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిని మూసివేశారు. అయితే అప్పటికే ఆరుగురు నర్సులకు, ఆ తరువాత మరో ఐదుగురికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ వైద్యశాల లోని 19 మంది రోగుల సాంపిల్స్ ను కరోనా టెస్టులకోసం పంపారు. ఇక్కడి డాక్టర్ కుటుంబ సభ్యులు ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగి వచ్చారని, వారి ద్వారా ఆ డాక్టర్ కు, ఆయన నుంచి నర్సులకూ ఇది వ్యాపించిందని తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బందిలో 45 మందిని క్వారంటైన్ కి తరలించారు. వీరిలో ఇంత త్వరగా ఈ వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై హాస్పిటల్ యాజమాన్యం విచారణ జరుపుతోంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం మొహల్లాలో నిర్వహించే ఓ క్లినిక్ లో ఇద్దరు డాక్టర్ దంపతులకు కరోనా సోకిందని, సౌదీ వెళ్లి వఛ్చిన ఒక రోగి నుంచి వారికి ఇది అంటుకుందని తెలుస్తోంది. అటు -ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లకు, 26 మంది నర్సులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆ హాస్పిటల్ ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.