‘బౌండరీ కౌంట్’ వివాదం.. కుంబ్లే అధ్యక్షతన కమిటీ
2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. ఈ రూల్పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ. దీనిపై ఐసీసీ జనవర్ మేనేజర్ జేఫ్ అలార్డైస్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ ఫైనల్లో జరిగిన వివాదాలపై ఐసీసీ ఓ కమిటీని […]
2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. ఈ రూల్పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ.
దీనిపై ఐసీసీ జనవర్ మేనేజర్ జేఫ్ అలార్డైస్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ ఫైనల్లో జరిగిన వివాదాలపై ఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కుంబ్లే అధ్యక్షత వహిస్తాడు. వచ్చే సమావేశంలో ఈ వివాదాస్పద అంశాన్ని కమిటీ చర్చించనుంది. సూపర్ ఓవర్లో ఫలితం తేలకపోతే బౌండరీ కౌంట్ విధానాన్ని 2009 నుంచి ఉపయోగిస్తున్నాం. దాదాపు అన్ని టీ20 మ్యాచ్ల్లో ఈ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. బౌండరీ కౌంట్ క్రికెట్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది’’ అని పేర్కొన్నారు. కాగా జూలై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తరువాత సూపర్ ఓవర్లోనూ ఫలితం రాలేదు. దీంతో బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.