ఏపీ సచివాలయాన్ని వెంటాడుతున్న కరోనా..31కి చేరిన కేసులు
ఏపీ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదలటం లేదు. సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. 3వ బ్లాకులోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో
ఏపీ సచివాలయాన్ని కరోనా మహమ్మారి వదలటం లేదు. సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. 3వ బ్లాకులోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో తోటి ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజా కేసుతో కలుపుకుని సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగుల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31కి చేరింది.
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వీర విహారం చేస్తోంది. రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ ల సంఖ్య 21,197కు చేరింది. బుధవారం తాజాగా 762 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 11,200 మంది ఆస్పత్రు ల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,745కి చేరింది. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 252కు పెరిగింది.