కూలిన ఏపీ తాత్కాలిక హైకోర్టు గోడ
ఏపీ రాజధానిలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం గోడ కూలిపోయింది. జనరేటర్కు సంబంధించిన నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్కు చెందినవారని అక్కడి వారు చెప్పారు.
ఏపీ రాజధానిలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం గోడ కూలిపోయింది. జనరేటర్కు సంబంధించిన నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్కు చెందినవారని అక్కడి వారు చెప్పారు.