Vijayasai Reddy : రూ. 332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదముద్ర : విజయసాయిరెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం దగ్గర 332 కోట్ల రూపాయలతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర..
YSRCP MP Vijayasai reddy : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం దగ్గర 332 కోట్ల రూపాయలతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. 40 ఎకరాల్లో నిర్మించే ఈ వర్సిటీలో అక్వా రంగానికి సాయపడే పరిశోధనా సంస్థలు వస్తాయని చెప్పారు. దీనికి అనుబంధంగా పలాస, కైకలూరుల్లో ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతారని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విజయసాయి ఆరోపించారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపుతోందని ఆయన విమర్శించారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా పోలవరం విషయంలో కేంద్రం మాట తప్పుతోందన్నారు విజయసాయి.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ. 55,657 కోట్లు కాగా ఎనిమిదేళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చింది రూ.11,182 కోట్లు మాత్రమేనని విజయసాయి ట్వీట్లో ఆరోపించారు.
విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. జాతీయ ప్రాజెక్ట్ అయినా పోలవరం విషయంలో మాట తప్పుతోంది. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ. 55,657 కోట్లు కాగా ఎనిమిదేళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చింది రూ.11,182 కోట్లు మాత్రమే. pic.twitter.com/OR6bAPRocB
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 24, 2021
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద 332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్ గారు ఆమోద ముద్ర వేశారు. 40 ఎకరాల్లో నిర్మించే ఈ వర్సిటీలో అక్వా రంగానికి సాయపడే పరిశోధనా సంస్థలు వస్తాయి. దీనికి అనుబంధంగా పలాస, కైకలూరుల్లో ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 24, 2021
Read also : Disha app : దిశ యాప్ : మహిళా రక్షణకు ఉక్కు కవచం, చెవిరెడ్డి పనితో సీఎం జగన్ ఫుల్ ఖుషి