పేదల పాలిట నిజమైన దేవుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైఎస్ గత జ్ణాపకాల్ని నెమరువేసుకున్నారు. వైఎస్ తమ మధ్య లేకపోవడం..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైఎస్ గత జ్ణాపకాల్ని నెమరువేసుకున్నారు. వైఎస్ తమ మధ్య లేకపోవడం ప్రతి పేదవాడికి తీరనిలోటన్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో లబ్ధి పొందని ఇంటి గడప లేదని వ్యాఖ్యానించారు. కుల, మత, పార్టీలు చూడకుండా పేదవారందరికి పధకాల ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేలు చేశారని పార్థసారధి అన్నారు. పేద విద్యార్థుల చదువుకై ఆలోచన చేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చారన్నారు. పేదలందరికి ఇళ్ళు కట్టించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికోసం ఆరోగ్య శ్రీ తీసుకు వచ్చారని, దీని వల్ల పేదోడు కూడా కోటేశ్వరుడితో సమానంగా వైద్యం పొందేలా చేశారని కొనియాడారు. నాన్న ఒక్క అడుగు వేస్తే రెండడుగులు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమల్లోకి తెస్తున్నారని చెప్పుకొచ్చారు.