వివేకా హత్యకేసులో ఇంకొకరికి నార్కో పరీక్షలు
కడప: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. పరమేశ్వర్ రెడ్డికి నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాలని దాఖలు చేసిన పిటిషన్పై పులివెందుల కోర్టు సానుకూలంగా స్పందించింది. పరమేశ్వర్ రెడ్డి సమ్మతితోనే నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. మూడు రోజుల క్రితమే నార్కో పరీక్షల […]
కడప: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. పరమేశ్వర్ రెడ్డికి నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాలని దాఖలు చేసిన పిటిషన్పై పులివెందుల కోర్టు సానుకూలంగా స్పందించింది. పరమేశ్వర్ రెడ్డి సమ్మతితోనే నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. మూడు రోజుల క్రితమే నార్కో పరీక్షల నిమిత్తం రంగన్న, ఎర్ర గంగిరెడ్డి, శేఖర్ రెడ్డిని సిట్ బృందం గుజరాత్కు తరలించింది.