ఏపీ : వైన్షాప్ వాచ్మెన్ దారుణహత్య…మద్యం సీసాల కోసం..?
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో విషాదం చోటుచేసుకుంది. వైన్షాపు వాచ్మెన్గా పనిచేసే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇప్పుడు మండలంలో కలకలం రేపుతోంది. వైన్షాప్ ముందే ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంకటేశ్ కుటుంబసభ్యులు, స్థానికులను ప్రశ్నించి ఇన్ఫర్మేషన్ సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి […]
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో విషాదం చోటుచేసుకుంది. వైన్షాపు వాచ్మెన్గా పనిచేసే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇప్పుడు మండలంలో కలకలం రేపుతోంది. వైన్షాప్ ముందే ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంకటేశ్ కుటుంబసభ్యులు, స్థానికులను ప్రశ్నించి ఇన్ఫర్మేషన్ సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. దర్యాప్తు ప్రారంభించారు.
లాక్డౌన్ సమయంలో మద్యం షాపులు మూసివేసి ఉండటంతో..మద్యం సీసాల దొంగతనం కోసం వచ్చిన వారెవరైనా చంపేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.