Andhra Pradesh: ప్రియుడి మోజులో ఇల్లొదిలి సరసాలకు… మొగుడిని చంపి చెరసాలకు.. కి’లేడీ’
గుమ్మలక్ష్మిపురం.... పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చని పల్లె. చిన్నకొల్లివలస... శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని ఓ గ్రామం. ప్రశాంతంగా ఉండే ఈ రెండు ఊర్లలో ఒక్కసారిగా కలకలం. అందుకు కారణం... పతీ..పత్నీ ఔర్ ఓ ...
AP Crime News: ప్రియుడి మోజులో ఇల్లొదిలి సరసాలకు… మొగుడిని చంపి చెరసాలకు.. ఓ కి’లేడీ’ ఇల్లీగల్ క్రైమ్ కథా చిత్రమ్ శ్రీకాకుళం(srikakulam) జిల్లాలో హాట్టాపిక్గా మారింది. హిరమండలం(hiramandalam) చిన్నకొల్లివలసలో నివశించే రాజు- సజాత భార్యాభర్తలు. వాళ్లకు పిల్లలు కూడా వున్నారు. చిన్నా చితక పనులు చేసుకుంటూ ఉన్నంతలో బాగానే ఉండేవాళ్లు. ఉపాధి కోసం రాజు అడపాదడపా వలస బాటపట్టేవాడు. పాడలి గ్రామానికి చెందిన బురళ్ల రాము అనే వ్యక్తి తరుచూ వీళ్లంటికి వచ్చేవాడు. మర్యాదల మాటున చూపులు కలిశాయి. చాటు మాటు వ్యవహారం పట్టాలెక్కింది. అతను ఇలా రావడం.. అమె అదోలా చూడడం.. ష్ ..గప్చుప్..నువ్వు నేను.. దర్వాజ్ బంద్ కరో .. ఇట్టాంటి రీళ్లు నడుస్తూనే పోయాయి. వీళ్లద్దరి క్లోజ్డ్ సర్క్యూట్ యవ్వారం ఓ రోజు రాజు కంట పడనే పడింది. ఇదేం పనంటూ భార్యను మందలించాడు. మారుద్దని ఆశించాడు. ఇక బుద్దిగా ఉంటుందిలే అని ఆ ఎపిసోడ్ గురించి పెద్దగా ఆలోచించలేదతను. ఉపాధి కోసం హైదరాబాద్ బాటపట్టాడు. ఇంకేం వీళ్లద్దరిదే హవా హవాయి. ఐతే రాజు మళ్లీ ఊళ్లోకొచ్చాడు. అంతే వాళ్లలో షేడ్స్ మారాయి. అతనుంటే వీళ్ల కథ నడవదనుకున్నారు. కడతేర్చాలని ప్లానేశారు. ఇంకేం ఆమె హాస్కీ వాయిస్కు బూరెలా ఉబ్బితబ్బిబ్బయిన రాము తన కన్నింగ్ బుర్రకు పదను పెట్టాడు. జిగర్ దోస్తులకు ఫోన్ కొట్టాడు. అంతా సిట్టింగేసి రాజును కడతేర్చాలని స్కెచ్చేశారు. సుజాత ప్రియుడు రాము అతని ఫ్రెండ్ నూకరాజు .. రాజును మద్యం పార్టీకి ఇన్వయిట్ చేశారు. ఫుల్గా తాగించారు. అతను మైకంలో జారుకున్నాక తమ ప్లాన్ను అమలు చేశారు. దాడి చేసి రాజును హత్య చేశాడు. సుజాతకు ఫోన్ కొట్టారు. శవం దొరికితే నిజం బయటపడుతుంది ..కాల్చిపారేయమని సందేశం ఇచ్చిందామె. ఆమె చెప్పినట్టుగా చేశారు. వర్షం రావడంతో శవం పూర్తిగా కాలకపోవడంతో కాల్వలో పడేసి వెళ్లిపోయారు. మ్యాటర్ మూడో కంటికి తెలియలేదు.
కానీ ఎట్టకేలకు ఈ కేసులో మిస్టరీ తేల్చారు పోలీసులు. అదెలాగంటే మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు.. వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో భర్తను చంపించిన సుజాత.. డ్రామా రక్తి కట్టించింది. తన భర్త కన్పించడం లేదని హిర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత పిల్లలను ..ఇంటిని గాలికొదిలి ప్రియుడితో కలిసి హైదరాబాద్కు జంప్. ఎగిరిపోతే ఇంత బాగుంటందా..అని ఫిదా అయిపోయింది. కానీ హిర పోలీసులు వైడ్ యాంగిల్ కూపీలాగారు. రాజు ఫోన్ కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు. కాల్ చేస్తే పట్నంలో ఆ ఇద్దరి ఇల్లీగల్ కాంటాక్ట్ రివీలైంది. అదుపులోకి తీసుకొని ఆరా తీస్తే .. రాము, సుజాత ఇల్లీగల్ జోడి నేరం తమదేనని అంగీకరించారు. వాళ్లిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నూకరాజును కూడా అరెస్ట్ చేసి కటకటాల బాటపట్టించారు కొత్తపేట పోలీసులు. ఓర్నీ.. చూడ్డానికి అమాయక ఫేసులే. కానీ ఇంత కథ నడిపారా? అని అవ్వాక్కయ్యారు గుమ్మలక్ష్మిపురం, కొత్తవలస గ్రామస్తులు. అన్యాయంగా నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..