పేకాటలో దొరికిపోయానన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
పేకాటలో దొరికిపోయానన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది
Young Man suicide: పేకాటలో దొరికిపోయానన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో రాజశేఖర్ రెడ్డి అనే ఓ యువకుడు రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ పట్టుబడ్డాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కుమారుడు మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అయితే సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడంటూ తమ కుమారుడుని పోలీసులు కొట్టారని.. దాని వలనే ఆత్మహత్య చేసుకున్నాడని రాజశేఖర్ తల్లి ఆరోపిస్తున్నారు. కాగా రాజశేఖర్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపామే తప్ప కొట్టలేదని పోలీసులు చెబుతున్నారు.
Read More:
తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు..