వైజాగ్ గ్యాస్ ప్రమాదం.. ‘ఎల్జీ పాలిమర్స్’ చరిత్ర ఇదే..!
విష వాయువు స్టెరీన్ లీకేజీతో ఉక్కునగరం వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ లీకైన ఘటనలో ఇప్పటికే 10 మంది మరణించగా.. వంద మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
విష వాయువు స్టెరీన్ లీకేజీతో ఉక్కునగరం వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ లీకైన ఘటనలో ఇప్పటికే 10 మంది మరణించగా.. వంద మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ను అదుపులోకి తెచ్చినప్పటికీ.. స్టెరీన్ ప్రభావం ఇప్పటికే ఆ చుట్టుపక్కల 11 గ్రామాలకు పాకింది. దీంతో ఎక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోతున్నారు. రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
కాగా ఎల్జీపాలిమర్స్ చరిత్రను ఒకసారి చూస్తే.. 1961లో హిందూస్తాన్ పాలిమర్స్ పేరుతో ఈ కంపెనీని ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్ తీసుకోగా.. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ గ్రూప్ ఈ కంపెనీని తీసుకుంది. ఆ తరువాత దీనికి ఎల్జీ పాలిమర్స్గా పేరు మార్చారు. ఈ కంపెనీలో 363 మంది ఉద్యోగులు ఉండగా.. ప్రతి రోజు 417 టన్నుల పాలిస్టెరిన్ ఉత్పత్తి చేస్తోంది. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టెరీన్ నిల్వ ఉంచుతుంటారు. ప్రస్తుతం కంపెనీ ట్యాంకుల్లో 2వేల మెట్రిక్ టన్నుల స్టెరీన్ నిల్వలు ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులు ఈ కంపెనీ మూతబడగా.. తాజాగా ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తెరుచుకునేందుకు సిద్ధమైంది. ఆ క్రమంలోనే ప్రమాదం సంభవించింది.
Read This Story Also: ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా విజృంభణ.. తాజా కేసులు ఎన్నంటే..!