స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదం: వెలుగులోకి రమేష్ ఆసుపత్రి అక్రమాలు
విజయవాడలోని రమేష్ ఆసుపత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగు రోజులుగా దర్యాప్తు చేసిన కమిటీ, పూర్తి ఆధారాలను సేకరించింది.
Vijayawada Fire Accident: విజయవాడలోని రమేష్ ఆసుపత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగు రోజులుగా దర్యాప్తు చేసిన కమిటీ, పూర్తి ఆధారాలను సేకరించింది. పోలీసు వివరాల ప్రకారం.. మే 18న స్వర్ణా ప్యాలెస్లో కరోనా కేర్ సెంటర్కి అనుమతి కోరిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం.. మే 15 నుంచే అక్కడ కోవిడ్ కేర్ సెంటర్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లను వారు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని గుర్తించిన కమిటీ, కరోనా రోగుల నుంచి భారీగా వసూలు చేసినట్లు నివేదికలో తెలిపింది. అనుమతికి మించి రోగులకు చేర్చుకున్నట్లు నివేదికలో వెల్లడించారు. భద్రతా ప్రమాణాలు లేకపోయినా స్వర్ణా ప్యాలెస్లో కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కాగా స్వర్ణా ప్యాలెస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే.
Read More:
షాకిచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.. చూస్తే మీరు షాక్ అవుతారు!