మేళ్లచెరువులో రమణీయంగా శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర కల్యాణం
మేళ్లచెరువులోని మహా సిమెంట్ పరిశ్రమలో మంగళవారం శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం రమణీయంగా జరిగింది. రామానుజ దాసులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 23 వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
మేళ్లచెరువులోని మహా సిమెంట్ పరిశ్రమలో మంగళవారం శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం రమణీయంగా జరిగింది. రామానుజ దాసులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 23 వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కళ్యాణ మండపాన్ని బహువిధ పుష్పములతో సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మూర్తులను అధిష్టింపజేశారు. వేద బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ తంతు నయన మనోహరంగా ప్రారంభమైంది. శ్రీదేవీ భూదేవీ అమ్మవార్ల నడుమ కళ్యాణ వేంకటేశ్వరుడు చూడ ముచ్చటగా దర్శనమిచ్చారు. అంతకు ముందు అమ్మవార్లను పెళ్లికూతురిగా అలంకరింపజేసి మేళతాళాలతో మైహోం ఛైర్మన్ రామేశ్వర్ రావు, శ్రీకుమారి దంపతులు పల్లకిపై అమ్మవార్లను వేదికపైకి చేర్చారు. మంగళ స్నానం, కన్యాదానం, జీలకరబెల్లం వంటి వివాహ తంతును చినజీయర్ స్వామి వారు జరిపించారు. మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక రమణీయంగా సాగింది. చిన జీయర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి అవసరమైనట్లు చెప్పారు. కరోనా పుణ్యమా అని షేక్ హేండ్ కి బదులు భారతీయ సంస్కృతిలో భాగమైన నమస్కారాన్ని అందరూ ఆచరిస్తున్నారని చమత్కరించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. కార్యక్రమానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి యర్రబెల్లి దయాకర్ రావు, వేనేపల్లి చందర్ రావుతో పాటు విశేష భక్త జనం తరలివచ్చి వీక్షించారు. Read This Story Also: హాలీవుడ్ను వెంటాడుతోన్న కరోనా.. ప్రముఖ హీరోయిన్కు పాజిటివ్..!