ఫీజులు పెంచారో.. ప్రైవేట్ పాఠశాలలకు తెలంగాణ విద్యాశాఖ హెచ్చరిక
కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచరాదని ప్రైవేట్ పాఠశాలలను తెలంగాణ విద్యాశాఖ హెచ్చరించింది. జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచరాదని ప్రైవేట్ పాఠశాలలను తెలంగాణ విద్యాశాఖ హెచ్చరించింది. జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అందులో కరోనా వైరస్ నేపథ్యంలో ఫీజుల పెంచరాదని తెలిపింది. అదనపు ఫీజులు కాకుండా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. అంతేకాదు ప్రతి నెల, నెల ఫీజు మాత్రమే వసూలు చేయాలని తెలిపింది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన రెండు పాఠశాలలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు హైదరాబాద్ డీఈవో వెంకట నరసమ్మ తెలిపారు. ఫీజులు కట్టిన వారికే కాకుండా మిగిలిన విద్యార్థులకు ఆన్లైన్లో క్లాస్లు చెప్పేలా యాజమాన్యాలు కో ఆపరేట్ చేయాలని ఆమె అన్నారు. ఎల్కేజీ నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతే క్లాస్లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎవరైనా పాఠశాలల యాజమాన్యాలు వేధిస్తే పేరెంట్స్ తమ దృష్టికి తీసుకురావాలని నరసమ్మ సూచించారు.