భైంసా అల్లర్లు.. ఎంత నష్టం జరిగిందంటే..!
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్ల ఘటనలో జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ అల్లర్లలో 11 ఇళ్లు పూర్తిగా, 23 పాక్షికంగా ధ్వంసం అయినట్టు వారు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం రూ.3.93 కోట్ల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. అయితే గత నెలలో భైంసాలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిచ్చు కాస్త రెండు వర్గాల మధ్య పెద్ద గొడవగా మారింది. […]
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్ల ఘటనలో జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ అల్లర్లలో 11 ఇళ్లు పూర్తిగా, 23 పాక్షికంగా ధ్వంసం అయినట్టు వారు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం రూ.3.93 కోట్ల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. అయితే గత నెలలో భైంసాలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిచ్చు కాస్త రెండు వర్గాల మధ్య పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఆస్తి నష్టం కూడా సంభవించిన విషయం తెలిసిందే.