Petrol, Diesel Price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

Petrol Diesel Rates Today: భారత్‌లో పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. అంతకుముందు నిత్యం భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల పరిస్థితి

Petrol, Diesel Price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Fuel price
Follow us

|

Updated on: Apr 15, 2021 | 8:05 AM

Petrol And Diesel Rates Today: భారత్‌లో పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. అంతకుముందు నిత్యం భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్ మరోవైపు గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరుగాయి. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు యజమానులు భయపడ్డారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కనపించింది. ఓ వైపు ప్రజలు, మరోవైపు విపక్షపార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.87 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.96 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.71 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.01గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.59 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.77, డీజిల్‌ ధర రూ.83.75 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.80 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.42 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.44 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 ఉండగా, డీజిల్‌ ధర రూ.90.06 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.96.39 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.37గా ఉంది.

Also Read:

నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా తాండవం, ఆసుపత్రిల్లో బెడ్స్ ఫుల్, స్వీయ నిర్భంధంలో గ్రామాలు